Gossipsమ‌హేష్‌కు విల‌న్‌గా సాయిప‌ల్ల‌వి...!

మ‌హేష్‌కు విల‌న్‌గా సాయిప‌ల్ల‌వి…!

సాయిప‌ల్ల‌వి కెరీర్‌లో చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఆమె అభిన‌యానికి మాత్రం ప్రేక్ష‌కులు ఎప్పుడూ మంచి మార్కులే వేశారు. ఫిదాలో ఆమె న‌ట‌న‌కు ఫిదా కాని తెలుగు ప్రేక్ష‌కుడు లేడు. స్టార్ హీరోలు అంద‌రూ కూడా సాయి ప‌ల్ల‌వితో సినిమా చేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అయితే ఎందుకో కాని ఆమెకు స‌రైన‌బ్రేక్ అయితే రావడం లేదు. పెద్ద హీరోల సినిమాల్లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మంచి ఛాన్స్ కూడా రాలేదు.

ఇదిలా ఉంటే సాయి ప‌ల్ల‌వి గురించి ఓ క్రేజీ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌హేష్ తాజా సినిమా స‌ర్కారు వారి పాట సినిమాలో సాయి ప‌ల్ల‌విని తీసుకునే ఆలోచ‌న‌లో ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం ఉన్నాడ‌ట‌. ఈ సినిమాలో మ‌హేష్ ప‌క్క‌న కీర్తి సురేష్ హీరోయిన్‌. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ సినిమా నేప‌థ్యంలో స‌ర్కారు వారి పాట సినిమా తెర‌కెక్కుతోంది. ఇక ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి కోసం కూడా ఓ రోల్ ఉంద‌ని.. ఆమెకు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం ఫోన్లోనే క‌థ‌ను వినిపించాడ‌ని తెలుస్తోంది.

చిన్న చిన్న మార్పులు, చేర్పుల‌తో సాయి ప‌ల్ల‌వి ఈ సినిమాలో నెగిటివ్ రోల్లో క‌నిపించేందుకు ఓకే చెప్పింద‌ని అంటున్నారు. అది నెగిటివ్ రోల్ అయినా సినిమాలో ఈ రోల్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి వ‌చ్చే యేడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news