Moviesత‌న ప‌రువు తీసిన హీరోయిన్‌పై న్యాయ‌పోరాటానికి రెడీ అంటోన్న హీరోయిన్‌

త‌న ప‌రువు తీసిన హీరోయిన్‌పై న్యాయ‌పోరాటానికి రెడీ అంటోన్న హీరోయిన్‌

బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌, నిర్మాత అనురాగ్ క‌శ్య‌ప్‌పై హీరోయిన్ పాయ‌ల్ ఘోష్ లైంగీక వేధింపుల ఆరోప‌ణ‌లు చేయ‌డంతో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ విష‌యంలో పాయ‌ల్ తాను పిలిస్తే రిచా చ‌ద్దాతో పాటు హ్యూమా ఖురేషీ వ‌స్తార‌ని.. నువ్వు ఎందుకు బెట్టు చేస్తున్నావ‌ని అన్నాడంటూ ఆ ఇద్ద‌రు హీరోయిన్ల పేర్లు బ‌య‌ట పెట్టింది. ఇక పాయ‌ల్‌కు కంగ‌నా లాంటి వాళ్లు మ‌ద్ద‌తు ఇస్తుంటే.. ఈ ఆరోప‌ణ‌ల‌ను అనురాగ్‌తో ప‌నిచేసిన హీరోయిన్లు ఖండిస్తూ ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

 

ఇదిలా ఉంటే పాయ‌ల్ తన పేరు అవమానకర రీతిలో వాడారంటూ రిచా ఆగ్రహం వ్యక్త చేయ‌డంతో పాటు ఆమెపై న్యాయ పోరాటానికి రెడీ అని చెపుతోంది. నిరాధారామైన ఆరోప‌ణ‌ల్లో అన‌వ‌స‌రంగా మూడో వ్య‌క్తి పేరు తీసుకురావ‌డం.. ఇత‌ర మ‌హిళ‌ల పేర్లు చెప్పి స‌మాజంలో వారి ఆత్మ‌గౌర‌వం కించ‌ప‌ర‌డం త‌గ‌ద‌ని కూడా రిచా త‌ర‌పు న్యాయ‌వాది చెపుతున్నారు. మ‌రి ఈ వివాదం ఎటు మ‌లుపులు తిరుగుతుందో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news