Moviesరియాకు డ్ర‌గ్స్‌, గంజాయి పిచ్చి.. మ‌రింత బిగుస్తోన్న ఉచ్చు

రియాకు డ్ర‌గ్స్‌, గంజాయి పిచ్చి.. మ‌రింత బిగుస్తోన్న ఉచ్చు

దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసులో ప్ర‌ధానంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న అత‌డి ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తికి డ్ర‌గ్స్‌తో పాటు గంజాయి పీల్చే అల‌వాటు ఉందంటున్నారు. రియాకు ఇప్ప‌టికే డ్ర‌గ్స్‌తో లింకులు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌లు రాగా.. ఇప్పుడు ఆమెకు గంజాయి కూడా తాగే అల‌వాటు ఉంద‌ని.. సుశాంత్ మేనేజర్  శృతి మోదీ సీబీఐకి వెల్లడించినట్లు సమాచారం. సుశాంత్‌తో పాటు అతడి హౌజ్‌ కీపింగ్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరండా, రియా, ఆమె సోదరుడు షోవిక్ టెర్రస్‌పై గంజాయి పీల్చేవారన్న విష‌యం శృతి సీబీఐకు చెప్పింద‌ట‌.

ఇక రియా ఓ ఇంట‌ర్వ్యూలో న‌న్ను క‌లిసే ముందే సుశాంత్‌కు గంజాయి తాగే అల‌వాటు ఉంద‌ని చెప్పింది. త‌న‌కు మాత్రం అలాంటి అల‌వాటు లేద‌ని కూడా చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇక శృతి తాను డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని చెపుతున్నా.. ఆమె డ్ర‌గ్ డీల‌ర్ల‌తో మాట్లాడ‌డం, చాటింగ్‌లు చేయ‌డం నుంచి తాజాగా గంజాయి తాగేద‌న్న వార్త‌లు చూస్తుంటే రియా ఎస్కేప్ అయ్యేందుకు చాలా అబ‌ద్ధాలు ఆడుతోంద‌న్న సందేహాలు వ‌స్తున్నాయి.

ఇక సుశాంత్‌తో క‌లిసి రియా గంజాయి పీల్చేద‌న్న విష‌యంపై ఇప్పుడు ఆధారాలు ఉండ‌డంతో ఈ కేసులో శృతి చుట్టూ ఉచ్చు మ‌రింత‌గా బిగుసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సుశాంత్‌ మృతి కేసులో రియా తండ్రి ఇంద్రజిత్‌ చక్రవర్తి ఈరోజు సీబీఐ ఎదుట హాజరయ్యారు. శాంతాక్రజ్‌లోని కాలీనాలో గల డీఆర్‌డీవో గెస్ట్‌హౌజ్‌లో విచారణ కొనసాగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news