Moviesఆ హీరోయిన్ ఎంట్రీ వార్త‌ల‌తో ముంబైలో ద‌డ‌ద‌డ‌... పోలీసులు ఏం చేశారంటే..

ఆ హీరోయిన్ ఎంట్రీ వార్త‌ల‌తో ముంబైలో ద‌డ‌ద‌డ‌… పోలీసులు ఏం చేశారంటే..

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ నటి కంగనా రనౌత్‌ ఈనెల 9న ముంబై పర్యటన వ‌స్తోంది. ఇప్ప‌టికే ఆమె ముంబైని పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌తో పోల్చ‌డం… శివ‌సేన ఆమెపై కారాలు మిరియాలు నూర‌డం… ఆమె తిరిగి కౌంట‌ర్ ఇవ్వ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో కంగ‌నాను శివ‌సైనికులు భారీగా టార్గెట్ చేస్తున్నారు. ఇక శివ‌సేన కాంట్ర‌వ‌ర్సీ ఎంపీ సంజ‌య్ రౌత్ ఆమె మ‌హారాష్ట్ర‌ను వ‌దిలి వెళ్లాల‌ని విమ‌ర్శించ‌గా అందుకు కంగ‌న తాను ఈ నెల 9వ తేదీన ముంబైలో అడుగు పెడుతున్నాన‌ని.. ద‌మ్ముంటే అడ్డుకోవాల‌ని స‌వాల్ విసిరారు.

దీంతో అలెర్ట్ అయిన కేంద్ర ప్ర‌భుత్వం కంగ‌నాకు వై కేట‌గిరి భ‌ద్ర‌త క‌ల్పించింది. ఈ నేప‌థ్యంలో కంగ‌నా ముంబైకు వ‌స్తోన్నందున భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు కేంద్ర రిజర్వ్‌ పోలీస్‌ బలగాల (సీఆర్‌పీఎఫ్‌) డిప్యూటీ కమాండెంట్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), హిమాచల్‌ప్రదేశ్‌ పోలీసు అధికారులు మనాలీలోని ఆమె నివాసానికి చేరుకుని అణువ‌ణువు సంద‌ర్శించారు. ఇక ఈ వార్త‌ల‌తో బాలీవుడ్‌లో, ముంబైలో ఒక్క‌సారిగా కాస్త అల‌జ‌డి రేగింది. ఇక ఈ వివాదంలో హిమాచ‌ల్ సీఎం జైరాం ఠాకూర్‌ బాలీవుడ్‌ క్వీన్‌కు బాసటగా నిలిచారు. కంగనా రనౌత్‌ హిమాచల్‌ప్రదేశ్‌ ముద్దుబిడ్డని వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news