Newsబ్రేకింగ్‌: మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల ఇంట్లో తీవ్ర విషాదం..

బ్రేకింగ్‌: మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల ఇంట్లో తీవ్ర విషాదం..

గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి తండ్రి మృతి చెందారు. ఆయ‌న గ‌త కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆళ్ల దశరథరామిరెడ్డి (87) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. వీరి కుటుంబానికి గుంటూరు జిల్లాలో మంచి పేరు ఉంది. పెద‌కాకాని వీరి స్వ‌స్థ‌లం. వీరి ఇద్ద‌రు కుమారుల్లో పెద్ద కుమారుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు కాగా, మరో కుమారుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.

ద‌శ‌ర‌థ రామిరెడ్డి మృతి పట్ల పలువురు పార్టీ నేతలు సంతాపం తెలిపారు. వీరి కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్‌లో కొన‌సాగుతుండ‌గా ఆ త‌ర్వాత వైఎస్సార్సీపీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో మంగ‌ళ‌గిరిలో ఆర్కే ఎమ్మెల్యేగా గెలిస్తే, న‌ర‌సారావుపేట‌లో ఎంపీగా పోటీ చేసిన అయోధ్య రామిరెడ్డి ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆళ్ల వ‌రుస‌గా రెండోసారి ఎమ్మెల్యేగా గెల‌వ‌గా.. ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్న అయోధ్య రామిరెడ్డి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news