Moviesమ‌హేష్‌బాబు మార్కెట్ స్టామినా అరాచ‌క‌మే...!

మ‌హేష్‌బాబు మార్కెట్ స్టామినా అరాచ‌క‌మే…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సర్కారువారి పాట. స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి బ్లాక్ బస్ట‌ర్ హిట్ త‌ర్వాత మ‌హేష్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. మూడు వ‌రుస బ్లాక్ బస్ట‌ర్ల‌తో మ‌హేష్ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. గీత‌గోవిందం ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే స‌ర్కారు వారి పాట ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌హేష్ మెడ‌పై రూపాయి కాయిన్ టాటూ యూత్‌లో ట్రెండింగ్‌గా మారింది.

ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. బాలీవుడ్ న‌టుడు అనిల్ క‌పూర్ సైతం ఈ సినిమాలో న‌టిస్తున్నాడ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే అమెరికాలో త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా తెలుగు డిజిటల్ రైట్స్ సహా శాటిలైట్ హక్కులను భారీ ధరకు విక్రయించారని తెలిసింది. ఇందుకోసం రు. 35 కోట్లు చెల్లించేందుకు ఓ ప్ర‌ముఖ సంస్థ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇది భారీ రేటు అనే చెప్పాలి.

 

వ‌రుస హిట్ల‌తో మ‌హేష్‌బాబు స్టామినా ఏంటో మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది. ఇక‌ హిందీ సహా ఇతర భాషల శాటిలైట్ హక్కుల బిజినెస్‌, అనువాదం రైట్స్ పెండింగ్‌లోనే ఉన్నాయ‌ట‌. ఏదేమైనా టాలీవుడ్‌లో రోజు రోజుకు మ‌హేష్ స్టామినా అరాచ‌కం రేంజ్‌లో దూసుకుపోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news