Politicsమ‌ళ్లీ హాస్ప‌ట‌ల్లో అమిత్ షా... బీజేపీలో ఒక్క‌టే టెన్ష‌న్‌

మ‌ళ్లీ హాస్ప‌ట‌ల్లో అమిత్ షా… బీజేపీలో ఒక్క‌టే టెన్ష‌న్‌

కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా కొద్ది రోజుల క్రితం క‌రోనా భారీన ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఎయిమ్స్‌లో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. దాదాపుగా నెల రోజులుగా ఆయ‌న అంత యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. ఇప్పుడిప్పుడే ఆయ‌న కోలుకుంటున్నారు అనుకుంటోన్న స‌మ‌యంలో మ‌రోసారి ఆయ‌న హాస్ప‌ట‌ల్లో చేర‌డంతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక్ అవుతున్నారు. గ‌త రాత్రి ఆయ‌న‌కు తీవ్ర శ్వాస స‌మ‌స్య త‌లెత్త‌డంతో మ‌ళ్లీ ఎయిమ్స్‌కు త‌ర‌లించారు.

Coronavirus | Amit Shah supervising anti-virus fight, Supreme Court told -  The Hindu

ఎయిమ్స్ ఆసుప‌త్రిలోని కార్డియో న్యూరో సెంట‌ర్ విభాగంలో ఆయ‌న చికిత్స పొందుతున్నార‌ని.. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరో‌గ్యం నిల‌కడ‌గా ఉంద‌ని తెలుస్తోంది. ఆయ‌న‌కు శ్వాస‌కోస సంబంధ స‌మ‌స్య‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక షా మ‌ళ్లీ హాస్ప‌టల్లో జాయిన్ అవ్వ‌డంతో బీజేపీ జాతీయ శ్రేణులు ఆందోళ‌న‌తోనే ఉన్నాయి. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సైతం ఆరా తీశార‌ని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news