Moviesటీవీ న‌టి శ్రావ‌ణి కేసులో అస‌లు విల‌న్ అత‌డే... థ్రిల్ల‌ర్ సినిమా...

టీవీ న‌టి శ్రావ‌ణి కేసులో అస‌లు విల‌న్ అత‌డే… థ్రిల్ల‌ర్ సినిమా ట్విస్టులు

మన‌సు మ‌మ‌త‌లు, మౌన‌రాగం సీరియ‌ల్లో న‌టించిన ప్ర‌ముఖ టీవీ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ప్ప‌టి నుంచి ఈ కేసులో వెలుగు చూస్తోన్న విష‌యాలు థ్రిల్ల‌ర్ సినిమా ట్విస్టుల‌ను త‌ల‌పిస్తున్నాయి. ఇక ఈ కేసులో దేవ‌రాజ్‌, సాయితో పాటు ఆర్ఎక్స్ 100 నిర్మాత‌ల పేర్లు ప్ర‌ధానంగా వెలుగులోకి వ‌చ్చాయి. అస‌లు విల‌న్ ఎవ‌రో కూడా ఎవ్వ‌రికి అర్థం కాని ప‌రిస్థితి.

తాజాగా శ్రావ‌ణి త‌ల్లి పాపాత‌ర్నం మాట్లాడుతూ శ్రావ‌ణి చ‌నిపోవ‌డానికి సాయికి సంబంధం లేద‌ని.. దేవ‌రాజు వ‌ల్లే త‌మ బిడ్డ ప్రాణాలు పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆదివారం మీడిమాతో మాట్లాడిన పాపార‌త్నం దేవ‌రాజు నుంచి దూరంగా ఉండాల‌నే సాయి శ్రావ‌ణిని కొట్టాడే త‌ప్పా మ‌రో విధంగా కాద‌న్నారు. దేవ‌రాజు త‌న‌పై ఉన్న కేసు తీయించుకునేందుకే త‌మ అమ్మాయితో ప్రేమ నాట‌కం ఆడాడ‌ని ఆమె వాపోయారు.

 

శ్రావణి చనిపోయే ముందు కూడా బాత్ రూంలోకి వెళ్లి దేవ‌రాజ్‌కు ఫోన్ చేసినా పెళ్లి చేసుకుంటాన‌ని చెప్ప‌లేద‌ని.. అందుకే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని పాపార‌త్నం చెప్పారు. ఇక దేవ‌రాజు మా అమ్మాయి దగ్గర డబ్బు తీసుకుని గ్లామర్ పెంచుకుని సీరియల్ అవకాశాలు దక్కించుకున్నాడు. మమ్మల్ని నట్టేట ముంచినాడ‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news