Moviesఆ ఇద్ద‌రు బిగ్‌బాస్ హౌస్‌లో వ‌ద్దు బాబోయ్‌... ఎలిమినేట్ చేసేయండి..!

ఆ ఇద్ద‌రు బిగ్‌బాస్ హౌస్‌లో వ‌ద్దు బాబోయ్‌… ఎలిమినేట్ చేసేయండి..!

తెలుగు బుల్లితెర రియాల్టీ పాపుల‌ర్ షో నాలుగో సీజ‌న్ ప్రారంభ‌మ‌వ్వ‌డంతో పాటు నాలుగు రోజుల‌కే మంచి ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇక తొలి వారం ఎలిమినేష‌న్లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. ఇప్ప‌టికే బ‌య‌ట వివిధ కంటెస్టెంట్ల‌కు సంబంధించిన ఆర్మీల ర‌చ్చ సోష‌ల్ మీడియాలో మోత మోగిపోతోంది. హౌస్‌లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా షోను ఎంజాయ్ చేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నా బ‌య‌ట హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల గురించి ఎవ‌రి అభిప్రాయం వారు వ్య‌క్తం చేస్తున్నారు.

ఎక్కువ మంది బిగ్‌బాస్ ఫ్యాన్స్ మాత్రం హౌస్‌లో ఉన్న ఇద్ద‌రు కంటెస్టెంట్ల ఓవ‌ర్ యాక్ష‌న్ చూడ‌లేక‌పోతున్నామ‌ని.. వారిని త్వ‌ర‌గా ఎలిమినేట్ చేసేయండి బాబోయ్ అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఆ ఇద్ద‌రు ఎవ‌రో కాదు డైరెక్ట‌ర్ సూర్య కిర‌ణ్‌, క‌రాటే క‌ల్యాణి, సూర్య‌కిర‌ణ్ తాను డైరెక్ట‌ర్‌ను అన్న ధీమాతోనే ఏమోగాని తొలి రోజు నుంచే తాను చెప్పిందే వినాల‌న్న ధోర‌ణితో ఉన్నారు. ఇత‌రులు చెప్పింది విన‌క‌పోవ‌డంతో ఆయ‌న‌కు అప్పుడే బ‌య‌ట నెగిటివిటీ పెరిగిపోతోంది.

ఇక క‌రాటే క‌ల్యాణి అయిన‌దానికి కానిదానికి బెదిరింపు ధోర‌ణితో ఉండ‌డంతో పాటు ట్యాప్ తిప్పేసి క‌న్నీళ్లు కార్చేస్తోంది. తాను సీనియ‌ర్‌ను అని.. అన్నీ త‌న‌కే తెలుసు అన్న‌ట్టుగా ఆమె వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆమె హౌస్‌లో మేజ‌ర్ స్క్రీన్ కోసం మ‌రీ ఓవ‌ర్ చేస్తోంద‌నే అంటున్నారు. ఆమె ఈ వారం ఎలిమినేష‌న్లో ఉంటే గ‌త సీజ‌న్లో హేమ తొలి వారంలో ఎలా వెళ్లిపోయిందో ఈ వారం క‌ల్యాణి వెళ్లిపోయేదే అంటున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news