Newsఏపీలో కీచ‌క పోలీస్‌... పెళ్ల‌యిన అమ్మాయిల‌తో కాపురం.. క్లైమాక్స్ ఇదే

ఏపీలో కీచ‌క పోలీస్‌… పెళ్ల‌యిన అమ్మాయిల‌తో కాపురం.. క్లైమాక్స్ ఇదే

ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఓ పోలీస్ కానిస్టేబుల్ పెళ్ల‌య్యి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న అమ్మాయితో స‌హ‌జీవ‌నం చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించాడు. మ‌న‌ద‌ప‌ల్లికి చెందిన సుగుణ ( 34)కు ముల‌క‌ల‌చెరువు మండ‌లం పెద్ద‌య్య‌గారిప‌ల్ల‌కు చెందిన ర‌మ‌ణారెడ్డితో పెళ్ల‌య్యింది. భ‌ర్త వ‌దిలేయ‌డంతో ఆమె మదనపల్లెలోని గౌతమీనగర్‌లో బ్యూటీపార్లర్ నడుపుకుంటూ తన ఇద్దరు పిల్లలను చదివించుకుంటోంది. జైళ్ల శాఖ కానిస్టేబుల్ అయిన క‌ర్నూలు జిల్లాకు చెందిన చంద్రకాంత్ బదిలీపై మదనపల్లె వచ్చాడు.

చంద్ర‌కాంత్‌కు సుగ‌ణ‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అత‌డు ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి స‌హ‌జీన‌వం ప్రారంభించాడు. ఎన్ని రోజులు అయినా పెళ్లి ఊసె ఎత్త‌క‌పోవ‌డంతో సుగ‌ణ ఆరా తీయ‌గా అత‌డికి మ‌రో అమ్మాయితో ప‌రిచ‌యం ఉన్న‌ట్టు తెలిసింది. నంద్యాలకి చెందిన యువతితో ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు తెలిసి నిలదీసింది. అనంతరం తీవ్ర మనస్థాపానికి గురైన సుగుణ ఇంట్లోనే చీరతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

కానిస్టేబుల్ చంద్రకాంత్ మోసం చేయడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న విచారణ చేపట్టారు. సుగుణ ఆత్మ‌హ‌త్య‌తో ఆమె ఇద్ద‌రు పిల్ల‌లు అనాథలు అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news