Newsబ్రేకింగ్‌: మ‌రో వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్

బ్రేకింగ్‌: మ‌రో వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్

ఏపీలో ప‌లువురు అధికార పార్టీ ఎమ్మెల్యేల‌కు వ‌రుస‌గా క‌రోనా పాజిటివ్ సోకుతుంది. ఇప్ప‌టికే ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు క‌రోనా భారీన ప‌డ్డారు. ఇక కొంద‌రు మాజీ మంత్రులు, మాజీ ప్ర‌జాప్ర‌తినిధులు కూడా క‌రోనాకు బ‌ల‌య్యారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు తిరుప‌తి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కరోన భారిన పడ్డారు. ఆయనకు స్వ‌ల్పంగా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డ‌డంతో ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. దీంతో క‌రోనా పాజిటివ్ అని తేలింది.

ఇక కొద్ది రోజుల క్రితం క‌రోనాతో మ‌ర‌ణించిన మృత‌దేహాల అంత్యక్రియ‌ల్లో కూడా క‌రుణాక‌ర్ రెడ్డి పాల్గొన్నారు. క‌రోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియ‌ల్లో పాల్గొన‌డం వ‌ల్ల క‌రోనా వ‌స్తుంద‌న్న అపోహ‌ల్లో ప్ర‌జ‌లు ఉన్న నేప‌థ్యంలో.. వాటిని తొల‌గించేందుకు క‌రోణాక‌ర్ రెడ్డి స్వ‌యంగా అంత్య‌క్రియ‌ల్లో పాల్గొని ఆద‌ర్శంగా నిలిచారు. ఈ సంఘ‌ట‌న జ‌రిగిన కొద్ది రోజుల‌కే ఆయ‌న‌కు కూడా క‌రోనా వ‌చ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news