Politicsఏపీలో మ‌రో సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌కు క‌రోనా పాజిటివ్‌

ఏపీలో మ‌రో సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌కు క‌రోనా పాజిటివ్‌

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ కేసుల సంఖ్య ఇప్ప‌టికే 3.82 ల‌క్ష‌ల‌కు చేరుకోగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కాటుతో 3541మంది ప్రాణాలు కోల్పోయారు.వీఐపీలను సైతం కరోనా వదలడం లేదు. ప్ర‌తి రోజు ఎవ‌రో ఒక ఎమ్మెల్యేకు క‌రోనా సోకుతూనే ఉంది. నిన్న‌టికి నిన్న తిరుప‌తి వైసీపీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

Undavalli Arun Kumar accepts open debate challenge on Polavaram Project

తాజాగా మాజీ ఎంపీ, రాజకీయ పండితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా కరోనా భారినపడ్డారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఉండవల్లి రాజమండ్రిలో హోం ఐసోలేషన్ లో ఉన్నారు. తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news