Newsఇండియాలోనే ఎక్కువ వేతనం ఆ భార్య‌భ‌ర్త‌ల‌దే.. అంబానీనే మించిన జీతం

ఇండియాలోనే ఎక్కువ వేతనం ఆ భార్య‌భ‌ర్త‌ల‌దే.. అంబానీనే మించిన జీతం

భార‌త్‌లో 2019 – 20 సంవ‌త్స‌రంలో ఎక్కువ జీతం అందుకున్న ఎగ్జిగ్యూటీవ్‌లుగా స‌న్‌టీవీ ప్ర‌మోట‌ర్లు క‌ళానిధి మార‌న్‌, కావేరి క‌ళానిధి మార‌న్ నిలిచారు. ఈ జంట వార్షిక వేత‌నం రు. 175 కోట్లు. ఇది రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ తీసుకునే వార్షిక వేత‌నం క‌న్నా చాలా ఎక్కువ‌. క‌ళానిధి మార‌న్ 1993లో ఈ కంపెనీని ప్రారంభించాడు. అప్ప‌టి నుంచి ఆయ‌నే ఎగ్జిగ్యూటీవ్ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. క‌ళానిధి, కావేరి వేత‌నంగా యేటా ఇద్ద‌రూ చెరో రు. 13.87 కోట్లు వేత‌నం తీసుకుంటున్నారు.

 

ఇక వీరు రు. 73.63 కోట్లు ఎక్స్‌గ్రేషియా పొందుతున్నారు. అంటే ఒక్కొక్క‌రు యేడాదికి రు. 87.50 కోట్ల వేత‌నం పొందుతున్నారు. ఇక రియ‌ల‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ త‌న వార్షిక వేత‌నాన్ని రు. 15 కోట్లుగానే ఫిక్స్ చేసుకున్నారు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఆయ‌న త‌న వార్షిక వేత‌న పెంపును నిలిపి వేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్‌-19 వ‌ల్ల ఆయ‌న త‌న వార్షిక వేత‌నం తీసుకోకూడ‌ద‌ని కూడా నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక స‌న్‌టీవీ వార్షికాదాయం రు. 3653 కోట్లు. ఇక ఇదే స‌మ‌యంలో గ‌తేడాది రు. 3883 కోట్లు ఆదాయం ల‌భించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news