Newsబ్రేకింగ్‌: టీడీపీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటివ్‌

బ్రేకింగ్‌: టీడీపీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటివ్‌

టీడీపీ ఫైర్‌బ్రాండ్ నేత‌, ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. విజ‌య‌వాడ న‌గ‌రంలో క‌రోనా తీవ్రంగా ఉన్నా కూడా ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే కొద్ది రోజులుగా ఆయ‌న అస్వ‌స్త‌త‌తో ఉండ‌డంతో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. దీంతో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డించారు.

త‌న‌కు క‌రోనా వ‌చ్చింద‌ని.. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు తాను 14 రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సి వ‌చ్చింద‌ని.. ఈ 14 రోజుల‌కు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని కూడా వెంక‌న్న ప్ర‌క‌టించారు. నాకు దైవ స‌మానులు అయిన మా పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు గారి ఆశీస్సుల‌తో తాను క‌రోనాను జ‌యించి త్వ‌ర‌లోనే మ‌ళ్లీ యాక్టివ్ అవుతాన‌ని ప్ర‌క‌టించారు. ఇక టీడీపీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు వెంక‌న్న గారు మీరు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పోస్టులు పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news