Politicsబ్రేకింగ్‌: ఎస్పీ. బాలుకు క‌రోనా పాజిటివ్‌...

బ్రేకింగ్‌: ఎస్పీ. బాలుకు క‌రోనా పాజిటివ్‌…

ప్ర‌ముఖ గాయ‌కులు ఎస్పీ. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు నిర్దార‌ణ అయ్యింది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు 19 ల‌క్ష‌లు దాటేశాయి. ఇక సినిమా వాళ్ల‌ను కూడా క‌రోనా వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కులు తేజ‌తో పాటు రాజ‌మౌళి ఫ్యామిలీకి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. నిన్న పాప్ సింగర్ స్మిత‌తో పాటు క‌మెడియ‌న్ పృథ్వికి సైతం క‌రోనా సోకింద‌న్న సందేహాలు వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎస్పీ బాలుకు సైతం క‌రోనా రావ‌డంతో ఆయ‌న ముందు జాగ్ర‌త్త‌గా చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్ప‌ట‌ల్లో జాయిన్ అయ్యార‌ని తెలుస్తోంది.

 

ఏదేమైనా క‌రోనా అటు రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు ఇటు సినిమా వాళ్ల‌ను కూడా వ‌ద‌ల‌కుండా వెంటాడుతోంది. ఏపీ, తెలంగాణ‌లో అధికార పార్టీల‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఇత‌ర ముఖ్య నేత‌లు సైతం క‌రోనా భారీన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ప్ర‌ముఖుల‌కు కూడా వ‌రుస‌గా క‌రోనా వ‌స్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news