Politicsసుశాంత్ డ‌బ్బును రియా.. ఆమె ఫ్యామిలీ దోచుకున్నారా... అక్క‌డే అస‌లు మ‌లుపు...!

సుశాంత్ డ‌బ్బును రియా.. ఆమె ఫ్యామిలీ దోచుకున్నారా… అక్క‌డే అస‌లు మ‌లుపు…!

బాలీవుడ్ దివంగ‌త హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో సంచ‌ల‌న వార్త‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా ఇప్పుడు సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి చుట్టూ అనేక సందేహాలు ముసురు కుంటున్నాయి. మ‌రోవైపు మ‌హారాష్ట్ర పోలీసులు కూడా ఈ కేసును ముందుకు సాగ‌నీయ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక మ‌హారాష్ట్ర మంత్రి, శివ‌సేన యువ‌నేత ఆదిత్య‌ థాక్రే కూడా ఈ కేసు ముందుకు సాగ‌కుండా జోక్యం చేసుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి.

 

ఇక ఈ కేసు విష‌యంలో ముందు నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్న కంగ‌నా ర‌నౌత్ ఇప్పుడు ఏకంగా మంత్రి ఆదిత్య థాక్రేను టార్గెట్ చేసింది. మీ తండ్రి ఉద్ద‌వ్ థాక్రే సీఎం కావ‌డ‌మే డ‌ర్టీ పాలిటిక్స్‌కు ఉదాహ‌ర‌ణ సార్ అన‌డంతో పాటు ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు మీ తండ్రిని అడ‌గండి అని కూడా ట్వీట్ చేచ‌సింది. కంగ‌న సంధించిన ప్ర‌శ్న‌లు ఇలా ఉన్నాయి.

 

హీరోయిన్ రియా ఎక్కడుంది ? సుశాంత్ మ‌ర‌ణంపై ముంబై పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయలేదు ? చ‌నిపోయిన తొలి రోజే పోలీసులు ఆత్మ‌హ‌త్య అని ఎలా చెపుతారు ? సుశాంత్ చ‌నిపోయిన చివ‌రి రోజు ఫోన్ డేటా ఎందుకు అందుబాటులో లేదు ? క్వారంటైన్ అంటూ ఈ కేసు విచార‌ణలో కీల‌కంగా ఉన్న ఐపీఎస్ అధికారి వినయ్ తివారీని ఎందుకు లాక్ చేశారు ? సీబీఐ గురించి ఎందుకు భయపడుతున్నార‌న్న ప్ర‌శ్న‌లు వేసిన ఆమె చివ‌రిగా సుశాంత్ డబ్బును రియా, ఆమె ఫ్యామిలీ ఎందుకు దోచుకున్నారు ? అని ప్ర‌శ్నించ‌డంతో పాటు ఆమె ప‌లు ర‌కాల సందేహాల‌కు తావిచ్చారు.

 

ఇక ఈ కేసును ఆదిత్య థాక్రే ముందుకు సాగకుండా అడ్డు ప‌డుతున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఇక చివ‌రిగా సుశాంత్ డ‌బ్బును రియాతో పాటు ఆమె ఫ్యామిలీ ఎలా దోచుకున్నారన్న ప్ర‌శ్న రైజ్ చేయ‌డం ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఈ సందేహాన్ని మ‌రింత అనుమానాల‌కు తావిచ్చేలా మాట్లాడింది. మ‌రి రియాకు ఈడీ స‌మ‌న్లు జారీ చేయ‌డంతో ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news