Newsయువ‌తిపై 139 మంది రేప్ కేసులో పోలీసులు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారే..!

యువ‌తిపై 139 మంది రేప్ కేసులో పోలీసులు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారే..!

ఓ 24 ఏళ్ల యువ‌తి త‌న‌పై ఏకంగా 139 మంది 5 వేల సార్లు అత్యాచారం చేశార‌ని పంజాగుట్ట పోలీస్‌స్టేష‌న్లో ఫిర్యాదు చేయ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. త‌న ఫిర్యాదులో త‌న‌పై అత్యాచారం చేసిన వారి పేర్లను కూడా  ఆమె పొందుప‌రిచిన సంగ‌తి తెలిసిందే. ఈ యువ‌తి ఇచ్చిన ఫిర్యాదుతోనే ఏకంగా 113 పేజీలతో ఎఫ్ ఐ  ఆర్ నమోదు చేశారు పంజాగుట్టు పోలీసులు.  ఈ 139 మంది త‌న‌ను ప‌దేళ్లుగా తీవ్రంగా వేధించ‌డంతో పాటు అత్యాచారం చేస్తున్నార‌ని కూడా ఆమె ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ప్ర‌త్యేక దృష్టి సారించారు.

ఈ కేసును స‌వాల్‌గా తీసుకున్న పోలీసులు సీసీఎస్‌కు బ‌దిలీ చేయ‌గా.. ఇప్పుడు ఈ కేసు విచార‌ణ కోస‌మే ప్ర‌త్యేక అధికారిగా ఏసీపీ శ్రీదేవిని నియమించారు. ఇప్ప‌టికే ఈ కేసు కోసం అనేక బృందాలు ఏర్ప‌డ్డాయి. ఇప్పుడు ఈ కేసు కోస‌మే ఏకంగా ఓ ఏసీపీ స్థాయి అధికారిణిని నియ‌మించ‌డం పోలీసులు దీనిపై ఎంత ప్ర‌త్యేక దృష్టి పెట్టారో తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేక‌రించి ద‌ర్యాప్తు  వేగవంతం చేసేందుకు సీసీఎస్ ప్రత్యేక బృందం సిద్ధమౌతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news