Sportsబ్రేకింగ్‌: ఎంఎస్‌. ధోనీకి లేఖ రాసిన ప్ర‌ధాని మోదీ

బ్రేకింగ్‌: ఎంఎస్‌. ధోనీకి లేఖ రాసిన ప్ర‌ధాని మోదీ

ఇటీవ‌ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్‌. ధోనీకి భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ లేఖ రాశారు. ఇప్ప‌టికే ధోనీ రిటైర్మెంట్‌పై యావ‌త్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు స్పందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోదీ ధోనీకి లేఖ రాశారు. ధోనీ రిటైర్మెంట్ ప‌ట్ల 130 కోట్ల మంది భార‌తీయులు ఎంతో నిరాశ‌కు గుర‌య్యార‌ని.. భార‌త క్రికెట్‌కు ధోనీ అందించిన సేవ‌లు ఎప్ప‌ట‌కీ గుర్తుండి పోతాయ‌ని మోదీ చెప్పారు.

 

క్రికెట్లో ఉత్త‌మ కెప్టెన్‌గా, వికెట్ కీప‌ర్‌గా అత‌ని చ‌రిత్ర ఎప్ప‌ట‌కీ చిర‌స్థాయిలో నిలిచిపోతోంద‌ని.. ధోనీ భ‌విష్య‌త్తులో మ‌రింత సంతోష‌క‌రంగా ఉండాల‌ని మోదీ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. ఇక మోదీ భ‌విష్య‌త్తులో వ్యాపార రంగంలో రాణించాల‌ని ప్లానింగ్ వేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news