Politicsబ్రేకింగ్‌: టీడీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

బ్రేకింగ్‌: టీడీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

ఏపీలో ఇప్ప‌టికే ఎంతో మంది ఎమ్మెల్యేలు క‌రోనా భారీన ప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా భారీన ప‌డిన వారిలో అంద‌రూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దాదాపు 12 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు క‌రోనాకు గుర‌య్యారు. నిన్న‌టికి నిన్న కూడా క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే శివ‌ప్ర‌సాద్ రెడ్డికి సైతం క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇక ఆదివారం ఓ టీడీపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు కరోనా పాజిటివ్. హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు వైద్యం అందిస్తున్నారు.

 

జోగేశ్వ‌ర‌రావు ఇప్ప‌టికే టీడీపీ నుంచి మండ‌పేట‌లో గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస విజ‌యాలు సాధిస్తూ హ్యాట్రిక్ కొట్టారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేల‌తో పాటు టీడీపీ నుంచి గెలిచి పార్టీ మారిన క‌ర‌ణం బ‌ల‌రాంకు సైతం క‌రోనా పాజిటివ్ సోకిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news