Moviesసినిమా ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా విషాదం... నిర్మాత మృతి

సినిమా ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా విషాదం… నిర్మాత మృతి

ప్ర‌పంచ మ‌హ‌మ్మారి సినిమా వాళ్ల‌ను వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు, హీరోయిన్లు, జూనియ‌ర్ ఆర్టిస్టులు క‌రోనా భారీన ప‌డుతున్నారు. వీరిలో ఒక‌రిద్ద‌రు మృతి చెందుతున్నారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా మ‌రో నిర్మాత‌ను బ‌లి తీసుకుంది. కోలీవుడ్ సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి లక్ష్మీ మూవీ మేకర్స్‌. కె మురళీధరన్, స్వామినాథన్, వేణుగోపాల్ అనే ముగ్గురు నిర్మాతలు కలిసి ఈ బ్యాన‌ర్ స్టార్ట్ చేశారు.

 

ఈ బ్యాన‌ర్‌పై తొలిసారిగా 1994లో అరణ్‌ మనై కావలన్‌ అనే సినిమా నిర్మించారు. ఆ తర్వాత గోకులంలో సీతై, ప్రియముడన్, భగవతి, అన్బే శివం తదితర పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. చివరగా ఈ సంస్థ జయం రవి హీరోగా సకల కళా వల్లవన్‌ చిత్రాన్ని నిర్మించారు. ఈ ముగ్గురు నిర్మాతల్లో ఒకరైన స్వామినాథన్‌కు ఇటీవ‌ల క‌రోనా సోకింది. ఆయ‌న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించ‌డంతో మృతి చెందారు. ఆయ‌న మృతికి కోలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news