Moviesతీవ్ర అస్వ‌స్థ‌త‌తో హాస్ప‌ట‌ల్లో హీరోయిన్ మూడో భ‌ర్త‌...!

తీవ్ర అస్వ‌స్థ‌త‌తో హాస్ప‌ట‌ల్లో హీరోయిన్ మూడో భ‌ర్త‌…!

వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న‌ వనితా విజయ్‌కుమార్ ఇటీవ‌ల మూడో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.  సినిమా ఇండస్ట్రీకి చెందిన పీటర్‌ పాల్‌ని వనితా జూన్ 27న‌ చెన్నైలో ఘనంగా పెళ్లాడింది. ఇక పెళ్లి త‌ర్వాత ఆమెపై కొందరు టార్గెట్‌ చేస్తూ కామెంట్ చేస్తుంటే.. వారికి తనదైన శైలిలో ధీటుగా స‌మాధానం చెబుతూ వార్త‌ల్లో నిలుస్తోంది. అయితే తాజాగా వ‌నిత‌ భ‌ర్త పీటర్‌ పాల్ హాస్ప‌ట‌ల్‌లో చేరారు.

చెస్ట్‌ పెయిన్ రావడంతో అతడిని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌నిత‌ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎమోష‌న‌ల్‌ అయ్యారు. ప్ర‌స్తుతం  పీటర్ ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని.. దాంతో ఇటీవలే ఆయన్ను ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసినట్లుగా వ‌నిత చెప్పుకొచ్చింది. దేవుడు గొప్పవాడు. ప్రతీది ఒక కారణంతోనే జరుగుతుందని నేను నమ్ముతాను. అందుకే దేవుడిపై భారం వేసి ఆయన ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా వ‌నిత ట్వీట్ చేసింది.

దీంతో వ‌నిత అభిమానులు.. పీటర్‌ పాల్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా,  సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూమార్తె అయిన వనిత విజయ్ కుమార్.. 2007లో ఆకాష్‌తో విడాకులు తీసుకుని.. అదే సంవ‌త్స‌రంలో ఆనంద్ జయ్ రాజన్ అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకుంది. వీరి బంధం కూడా ఎంతో కాలం నిల‌వ‌లేదు. ఇక పీటర్ పాల్‌ను ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. అయితే వీరి వివాహం ఇప్ప‌టికీ తమిళ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news