Politicsగుంటూరులో యువ‌కుడి మ‌ర్డ‌ర్‌... ప్రియురాలే హంత‌కురాలు

గుంటూరులో యువ‌కుడి మ‌ర్డ‌ర్‌… ప్రియురాలే హంత‌కురాలు

గుంటూరు జిల్లాలో సంచ‌ల‌నం సృష్టించిన ఓ వ్య‌క్తి హ‌త్య కేసులో ప్రియురాలే నిందితురాలు అని పోలీసులు తేల్చారు. ఈ సంఘ‌ట‌న‌లోకి వెళితే గ‌త నెల 23వ తేదీన అనంత‌వ‌ర‌ప్పాడులోని బొంత‌పాడు డొంక‌రోడ్డులోని పంట కాలువ‌లో ఓ వ్య‌క్తి మృత‌దేహం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ మృత‌దేహం పిడుగురాళ్ల‌కు చెందిన పురుగు మందుల వ్యాపారి పూర్ణ‌చంద్ర‌రావు ( 39) దిగా గుర్తించారు. పూర్ణ‌చంద్ర‌రావు గుత్తికొండ‌లో సారా అమ్మే వ్య‌క్తి వ‌ద్ద‌కు వెళుతున్న క్ర‌మంలో అత‌డి భార్య‌తో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. 2002లో ఆమె పిల్ల‌ల‌ను తీసుకుని గుంటూరు వ‌చ్చేసింది. 2005లో పూర్ణ‌చంద్ర‌రావుకు వేరే మ‌హిళ‌తో పెళ్లి అయినా ఆమెతో అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తూ ఉండేవాడు.

 

2011లో ఆ మ‌హిళ మ‌రో వ్య‌క్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఆమె ఇంటి వ‌ద్దే చీటిపాట‌లు వేస్తుండ‌డంతో పూర్ణ‌చంద్ర‌రావు కూడా ఆమె వ‌ద్ద చీటి వేశాడు. పూర్ణ‌చంద్ర‌రావు, ఆ మ‌హిళ వివాహేత‌ర సంబంధం రెండో భ‌ర్త‌కు తెలియ‌డంతో ఆమెతోనే అత‌డిని అంతం చేయాల‌నుకున్నాడు. ఈ క్రమంలోనే చీటి డ‌బ్బులు ఇస్తామ‌ని పూర్ణచంద్ర‌రావును పిలిపించుకున్నారు. అక్క‌డ ఈ భార్య‌భ‌ర్త‌ల‌తో పాటు రౌడీషీట‌ర్ రాజేష్‌, క‌రీముల్లాతో క‌లిసి ప్లాన్ చేసింది. వీరు చున్నీతో పాటు కేబుల్ వైరు మొడ‌కు బిగించి పూర్ణ‌చంద్ర‌రావును చంపేసి మృత‌దేహం గోనెలో పెట్టి కాలువలో ప‌డేశారు.

 

అయితే ఇక్క‌డ ఆ మ‌హిళా చాలా ట్విస్ట్ ప్లే చేసింది. ఈ కేసులో త‌న భ‌ర్త‌నే ఇరికించాల‌ని అత‌డి ఆధార్ కార్డు, ఓట‌రు కార్డు, క‌రెంటు బిల్లులు, ప‌ర్సులో పెట్టి ఆ మృత‌దేహంలో క‌లిపి కాలువ‌లో ప‌డేసింది. చివ‌ర‌కు పోలీసుల విచార‌ణ‌లో ఆమె అస‌లు రంగు బ‌య‌ట ప‌డింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news