Politicsబ్రేకింగ్‌: ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరేళ్లు స‌స్పెండ్‌

బ్రేకింగ్‌: ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరేళ్లు స‌స్పెండ్‌

బిహార్‌లో త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అక్క‌డ రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. అక్క‌డ ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని ఆర్జేడీ ప‌ట్టుద‌ల‌తో ఉంది. కాంగ్రెస్‌లో క‌లిసి ఈ సారి అక్క‌డ ఆర్జేడీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నుంది. ఇందుకు ఎత్తులు, పై ఎత్తుల‌తో ఆర్జేడీ ఉంది.

 

ఈ క్ర‌మంలోనే పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌న్న కార‌ణంతో ఆర్జేడీ ముగ్గురు ఎమ్మెల్యేల‌ను సస్పెండ్ చేసింది. ఆర్జేడీకి చెందిన మహేశ్వర్ ప్రసాద్ యాదవ్, ప్రేమా చౌదరి మరియు ఫరాజ్ ఫతామిలను ఆరు సంవ‌త్స‌రాల పాటు పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. ప్ర‌స్తుతం ఈ విష‌యం బిహార్‌తో పాటు రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news