Newsఅమ‌రావ‌తికి 95 శాతం ఓట్లు... నేష‌న‌ల్ స‌ర్వేలో కుండ‌బ‌ద్దులు కొట్టేశారు..

అమ‌రావ‌తికి 95 శాతం ఓట్లు… నేష‌న‌ల్ స‌ర్వేలో కుండ‌బ‌ద్దులు కొట్టేశారు..

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఏపీకి మూడు రాజ‌ధానుల అంశంపై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. అధికార వైఎస్సార్‌సీపీ ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌ణ పేరుతో ఏపీ రాజ‌ధానిని మూడు ప్రాంతాల్లోకి మార్చేస్తోంది. దీనిపై రాజ‌ధాని రైతులు కోర్టుకు వెళ్ల‌డంతో ప్ర‌స్తుతం ఈ ప్ర‌క్రియ‌కు బ్రేక్ ప‌డింది. ఇక విప‌క్ష టీడీపీతో పాటు రాజ‌ధాని ప్రాంతంలో పార్టీల‌తో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు అమరావ‌తినే రాజ‌ధానిగా ఉంచాల‌ని పోరాటాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే అమ‌రావ‌తి ఉద్య‌మం 250 రోజులు దాటేసింది.

ఇక అమ‌రావ‌తిని ఏకైక రాజ‌ధానిగా కొన‌సాగించాలా ?   లేదా ?  మూడు రాజ‌ధానులు ఉండాలా ? అన్న అంశంపై ఓ జాతీయ ఛానెల్ నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో ఏపీకి ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తే ఉంచాల‌ని మెజార్టీ ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చారు. ఆరు రోజుల్లో మొత్తం ఈ స‌ర్వేలో 3.76 లక్షల మంది ప్రజలు  పాల్గొన్నారు. అమరావతిని కోరుకుంటూ 95 శాతం మంది ప్రజలు ఓట్లు వేశారు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో ఏపీ అభివృద్ధి చెందాలంటే ఒకే రాజ‌ధాని ఉండాల‌ని.. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా మూడు రాజధానులు ఉండ‌డం వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని మెజార్టీ ప్ర‌జ‌లు ఏక‌గ్రీవంగా చెప్పారు.

ఇక అంత‌కు ముందే దీనిపై మ‌రో సర్వే జ‌రిగింది. ఈ యేడాది జ‌న‌వ‌రి 20న ఏపీ శాస‌న‌స‌భ‌లో ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్డీయే బిల్లు ర‌ద్దును అసెంబ్లీలో ఆమోదించారు. ఆ మ‌రుస‌టి రోజునే ఇండియా టీవీ ఛానెల్ దీనిపై ట్విట్ట‌ర్‌లో పోల్ నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది మూడు రాజ‌ధానులు మంచివి కావ‌ని చెపితే 29 శాతం మంది మాత్ర‌మే మూడు రాజధానుల‌కు అనుకూలంగా ఓటు వేశారు. నాలుగు శాతం మంది మాత్రం ఏమీ చెప్పలేమన్నారు. ఈ సర్వేలో సుమారు 8 వేలమంది పాల్గొన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news