Politicsభ‌ర్త‌ను వ‌దిలి ప్రియుడితో ప్రేమాయ‌ణం... తెలంగాణ‌లో మ‌లుపులు తిరిగిన ప్రేమ‌క‌థ‌

భ‌ర్త‌ను వ‌దిలి ప్రియుడితో ప్రేమాయ‌ణం… తెలంగాణ‌లో మ‌లుపులు తిరిగిన ప్రేమ‌క‌థ‌

స‌మాజంలో భ‌ర్త ఉండ‌గానే ప‌రాయి ప్రియుడి మోజులో ప‌డి మోస‌పోతోన్న మ‌హిళ‌ల‌ను… భార్య ఉండ‌గానే ప‌రాయి మ‌హిళ మోజులో ప‌డి మోస‌పోతోన్న భ‌ర్త‌ల‌ను మ‌నం ఎంతోమందిని చూస్తున్నాం.. ఈ సంఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతున్నా మ‌నుష్యులు మాత్రం ప‌రాయి మ‌హిళ‌లు / పురుషుల మోజులో ప‌డి మోసం పోవ‌డం కామ‌న్ అయ్యింది. తాజాగా భ‌ర్త ఉండ‌గానే ప్రియుడి మోజులో ప‌డి చివ‌ర‌కు మోస‌పోయిన ఓ మ‌హిళ ఉదంతం ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి మండలం ముత్యంపాడు గ్రామంలో జ‌రిగిన సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.

 

గ్రామంలో తాటి రాజారావు, నాగమణి దంపతులకు ప్రవీణ్‌ అనే కొడుకున్నాడు. ప్ర‌వీణ్ అదే గ్రామంలో ఉన్న మ‌డ‌కం న‌ర్సింహారావు భార్య జ్యోతిపై క‌న్నేశాడు. జ్యోతితో నువ్వు భ‌ర్త‌ను వ‌దిలేస్తే పెళ్లి చేసుకుంటాన‌ని మాయ‌మాట‌లు చెప్పాడు. దీంతో జ్యోతి ప్ర‌వీణ్‌కు లైంగీకంగా లొంగిపోయింది. భ‌ర్త‌ను వ‌దిలేసి ప్రియుడి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసింది. వీరు అదే గ్రామంలో స‌హ‌జీవ‌నం చేయ‌డం మొద‌లు పెట్టారు. కొద్ది రోజుల త‌ర్వాత పెళ్లి చేసుకోమ‌ని జ్యోతి ప్ర‌వీణ్‌ను అడ‌గ‌గా అత‌డు మొహం చాటేశాడు. దీంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించిన ఆమె ప్రియుడి ఇంటి ఎదుట ధ‌ర్నాకు దిగింది. దీంతో ప్ర‌వీణ్ కుటుంబ స‌భ్యులు ప‌రార‌య్యారు.ఏదేమైనా కుటుంబం ఉండ‌గానే పరాయి మోజులో ప‌డితే జీవితం ఏమ‌వుతుందో ? ఈ సంఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news