Moviesగీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే?

గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ మరోసారి ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాతో మహేష్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు చిత్ర వర్గాలు. అయితే ఈ సినిమా తరువాత మహేష్ ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.

అల్లు అరవింద్‌తో దీనికి సంబంధించి గతంలోనో ఒప్పందం చేసుకున్న మహేష్ ఈ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనే విషయంలో ఇప్పటివరకు ఉన్న సస్పెన్స్‌కు గీతా ఆర్ట్స్ చెక్ పెట్టింది. ఈ సినిమాకు గీతా గోవిందం లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీని అందించిన పరశురామ్‌ను డైరెక్టర్‌గా ఫిక్స్ చేశారు నిర్మాతలు. మహేష్ కోసం ఓ అదిరిపోయే కథను కూడా పరశురామ్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా గీతా గోవిందం లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్ అందించిన డైరెక్టర్ మహేష్ కోసం అంతకు మించిన కథను రెడీ చేయడం ఖాయమని అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా లేడీ అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news