Gossips" రథం'' ట్రైలర్ రొమాన్స్ తప్ప మాటల్లేవ్..!

” రథం” ట్రైలర్ రొమాన్స్ తప్ప మాటల్లేవ్..!

‘సందు దొరికితే పట్టేసుకుంటావా?’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్‌తో మొదలయిన ”రథం” మూవీ ట్రైలర్ ఆకట్టుకునేలా రూపొందించారు. గీతానంద్, ఛాందినీ భగ్వానని జంటగా నటించిన చిత్రం రథం. రాజ్‌గురు ఫిలింస్ బ్యానర్‌పై రాజా దారపునేని ఈ చిత్రాన్ని నిర్మించారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది.

మంచివాడు పక్కింట్లో ఉంటే మనోడురా అంటాం. అదే వాడు మనింట్లో ఉంటే ఇవన్నీ మనకెందుకురా అంటాం’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘18రోజుల యుద్ధం లక్షల్లో శవాలు.. కురుక్షేత్ర యుద్ధం కూడా ధర్మం కోసమే..’’ అంటూ హీరో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మొత్తంగా యాక్షన్, హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సినిమాకు సుకుమార్ పమ్మి మ్యూజిక్ అందించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news