Gossipsఅప్పుడు గురువు.. ఇప్పుడు ప్రేమ'ఆట'

అప్పుడు గురువు.. ఇప్పుడు ప్రేమ’ఆట’

తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ఇండియా పేరు మారుమోగించిన ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అయ్యింది. తాను పదేళ్లుగా ప్రేమిస్తున్న పారుపల్లి కశ్యప్ తో ఏడాదియగులు నడిచేందుకు సిద్దం అయ్యింది. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం పెద్దగా ఎవరికీ తెలియదు. దశాబ్దకాలంగా కలిసి ఆడుతున్న వీరిమధ్య ప్రేమ ఎప్పుడో చిగురించిందని, తాజాగా వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

వీరు ఇద్దరూ కలిసి డిన్నర్లకు, పార్టీలకు వెళ్లడం..సోషల్ మీడియాలో ఆ ఫొటోలను షేర్ చేసుకోవడంతో వీరిమధ్య ప్రేమ వ్యవహారం ఎప్పుడో బయటకు వచ్చింది. తాజాగా వెలువడుతున్న వార్తల ప్రకారం వచ్చే డిసెంబర్ 16న వీరిద్దరి పెండ్లి జరగబోతున్నట్లు సమాచారం. 2018 కామన్వెల్త్ క్రీడల సందర్భంగా తనకు కశ్యప్ ఎంతో అండగా నిలిచాడని సందర్భం వచ్చినప్పుడల్లా సైనా చెబుతూ ఉండేది.
13
సైనా నెహ్వాల్, కశ్యప్ ఇద్దరూ కోచ్ పుల్లెల గోపిచంద్ శిక్షణలో రాటు తేలినవారే. కానీ తమ ప్రేమ వ్యవహారం ఎక్కడా బయటపడకుండా ఇద్దరూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఎన్ని గాసిప్స్ వచ్చినా ఇద్దరూ పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు ఈ ఇద్దరి లవ్ గేమ్ సక్సెస్ ఫుల్ గా పెళ్ళిపీటల వరకు వెళ్లబోతుండడంతో ఈ ప్రేమ జంట ఆనందానికి అవధులే లేవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news