Gossipsనాగ్ పై ఫైర్ అయినా మహేష్ ఫ్యాన్స్!

నాగ్ పై ఫైర్ అయినా మహేష్ ఫ్యాన్స్!

అక్కినేని నాగార్జున నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్‌ఫుల్ అయ్యాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నాగ్ ప్రొడ్యూస్ చేస్తూ వస్తు్న్నాడు. తాజాగా సుశాంత్ నటించిన చి||ల|| సౌ|| చిత్రాన్ని నాగ్ తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారానే రిలీజ్ చేశాడు. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ కథ నాగ్‌కు బాగా నచ్చేయడంతో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఇక తాజాగా మహేష్ ఫ్యాన్స్‌ను హర్ట్ అయ్యేలా చేశాడు నాగ్.

తాజాగా గూఢచారి సక్సెస్ మీట్‌లో నాగ్ పాల్గొన్నాడు. అందులో నాగ్ మాట్లాడుతూ ‘‘ఈ ఏడాదిలో నిజాయితీగా సక్సెస్ అయిన సినిమాలు కేవలం మూడే.. రంగస్థలం, మహానటి, గూఢచారి.’’ అని అన్నాడు. అంటే పెట్టిన బడ్జెట్‌ కంటే చాలా ఎక్కువ తెచ్చిపెట్టిన సినిమాలను ఆయన ఈ కోవలో లెక్కపెట్టాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ చాలా ఫీలయ్యారు. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ చిత్రంగా నిలిచింది. అయితే దీనికి చాలా పెట్టుబడి పెట్టినా అది రైట్స్ అమ్మకం రూపంలోనే వచ్చింది. 100 కోట్ల షేర్ వసూళ్లు సాధించిన భరత్ అనే నేను బయ్యర్లకు పెద్ద మొత్తంలో లాభాలు తేలేకపోయింది.

ఇలా తమ అభిమాన హీరో చిత్రాన్ని నాగ్ ఇలా అవమానించడంతో మహేష్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. మరి ఈ కామెంట్స్‌పై నాగ్ ఏమైనా స్పందిస్తాడా అనేది చూడాలి. మరోవైపు నానితో కలిసి దేవదాస్ అనే మల్టీస్టారర్ చిత్రంలో నాగ్ నటిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news