Gossipsరాఖి పండగ రోజు...స్నేహితులే కీచకులై..!

రాఖి పండగ రోజు…స్నేహితులే కీచకులై..!

స్వాతంత్రం వచ్చిందని వేడుకలు జరుపుకుంటాం.. రాఖి పండుగ రోజు చెల్లి, అక్క రాఖి కడితే కట్టించుకుంటాం. ఆ రెండు రోజులు ఆడవారి మీద ప్రేమిస్తే సరిపోతుందా లేదు కదా. దేశంలో ఎంతమంది ఆడవాళ్లు అత్యాచారానికి గురవుతున్నారో తెలిసిందే. ఆడవాళ్లపై అగాయిత్యాలకు పాల్పడ్డ వారి మీద ఎలాంటి కేసులు పెట్టినా మళ్లీ అవి రిపీట్ అవుతూనే ఉన్నాయి.

ఇలాంటి సంఘటనలు రోజుకొకటి దేశంలో ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి. తాజాగా ఝార్ఖండ్ లో ఇలాంటి ఘటన జరిగింది. ఇద్దరు యువతులు ఇంటి పక్కన ఉన్న స్నేహితుడిని తోడు తీసుకుని పక్కన ఊరికి వెళ్లి వస్తుండగా వారి స్కూటీ పాడయ్యిందట. ఈలోగా ఒక యువతి తన మరో స్నేహితుడికి ఫోన్ చేస్తే అతను 11 మందిని పంపించాడట. ఆ 11 మంది ఇద్దరి ఆడవాళ్లకు తోడుగా వచ్చిన అతన్ని కొట్టి పంపించారట.

ఇక ఆ తర్వాత ఆ ఇద్దరి యువతులను అత్యాచారం చేశారట. దీని గురించి ఎవరికి చెప్పొద్దని భయపెట్టారట. ఇంటికొచ్చిన వారు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే వారు తమ స్నేహితుడుకి ఫోన్ చేయగా అతన్ని పట్టుకుని మిగతా వారి గురించి ఆరా తీస్తున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news