Newsఎన్టీఆర్ కి "జై" కొడుతూనే ఉన్నారు

ఎన్టీఆర్ కి “జై” కొడుతూనే ఉన్నారు

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన జై లవ కుశ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. కె.ఎస్ రవింద్ర డైరక్షన్ లో వచ్చిన జై లవ కుశ సినిమా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాణ్ రాం నిర్మించడం జరిగింది. 2017 దసరా బరిలో దిగి బాక్సాఫీస్ పై దండయాత్ర చేసింది.

అయితే జై లవ కుశ లో ట్రిపుల్ రోల్ చేసిన తారక్ జై పాత్రలో రావణా అంటూ రచ్చ చేశాడు. నత్తితో ఎన్.టి.ఆర్ చెప్పే రావణ డైలాగ్ అబ్బో ఇలా చెప్పడం ఒక్క తారక రాముడి వల్లే అన్నట్టుగా మురిపించాడు. ఈ సినిమాలో జై పాత్ర ఇంట్రడ్యూసింగ్ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేసింది. రిలీజ్ అయ్యి ఇన్న్నాళ్లవుతున్నా జై టీజర్ ఇంకా సంచలనంగా మారింది.

ఈ టీజర్ యూట్యూబ్ లో 20 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ త్రివిక్రం డైరక్షన్ లో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ ఆ సినిమా నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news