Gossipsఎన్.టి.ఆర్ త్రివిక్రం మూవీ షూటింగ్ పై షాకింగ్ న్యూస్..

ఎన్.టి.ఆర్ త్రివిక్రం మూవీ షూటింగ్ పై షాకింగ్ న్యూస్..

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో ఓ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తుంది. ఇక దీనికి సంబందిచిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ లా అనిపిస్తున్నా సినిమా అఫిషియల్ పోస్టర్ కు ఏమాత్రం తీసిపోనట్టుగా ఉంది.

ప్రస్తుతం అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ హడావిడిలో ఉన్న త్రివిక్రం తారక్ సినిమాను ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాడని ఎన్నాళ్ల నుండో చెబుతున్నారు. అయితే ఇక పోస్టర్ ద్వారా అదే చెప్పడం అంటే కచ్చితంగా ఇది ఫ్యాన్స్ ఉత్సాహంతో తయారు చేసిన పోస్టర్ అనే అనుకోవచ్చు. తారక్ తో త్రివిక్రం మొదటిసారి కలిసి పని చేస్తుండగా ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఇక అజ్ఞాతవాసి సినిమాకు మ్యూజిక్ అందించిన అనిరుద్ రవిచందర్ ఎన్.టి.ఆర్ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నాడు. హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే పూజా హెగ్దె ఫైనల్ అయినట్టు సమాచారం అయితే అఫిషియల్ గా మాత్రం ఎనౌన్స్ చేయలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news