Gossips3టికెట్ల ధర తెలిస్తే షాకే... టాలీవుడ్ చరిత్రలోనే ఇది ఒక సునామి

3టికెట్ల ధర తెలిస్తే షాకే… టాలీవుడ్ చరిత్రలోనే ఇది ఒక సునామి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమా రికార్డుల పని పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ గురించి అందరికి తెలిసిందే.. చెన్నైలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 3 టికెట్లను ఏకంగా 1 లక్షా 71 వేలకు కొనేశారట. చెన్నై ఎస్.ఆర్.ఎం కాలేజ్ స్టూడెంట్స్ ముగ్గురు మొదటి టికెట్ ను 92 వేలు, రెండవ టికెట్ 59 వేలు, మూడవ టికెట్ 39 వేలకు కొనేశారట.

వేలం ద్వారా వీరు ఈ టికెట్లు పొందటం జరిగిందట. 3 టికెట్లు ఈ రేంజ్ లో అమ్ముడవం సౌత్ ఇండియాలోనే ఇది రికార్డ్ అని అంటున్నారు. ఇక ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వాడుతారని తెలుస్తుంది. ఇదవరకు చెన్నైలో ఇదే కాలేజ్ స్టూడెంట్స్ జనతా గ్యారేజ్, ఖైది నంబర్ 150, కాటమరాయుడు, జై లవకుశ, స్పైడర్ సినిమాలకు వేలం వేశారు.

అయితే మునుపెన్నడు ఈ రేంజ్ లో టికెట్లు అమ్ముడవ్వలేదని తెలుస్తుంది. ప్రస్తుతం 3 టికెట్లు కొన్న వారి పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చూస్తుంటే అజ్ఞాతవాసి కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ బీభత్సంగా ఉంటుందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news