Gossipsమహేష్ నిర్మాతల కంగారు వెనుక రజనీ ఉన్నాడా..?

మహేష్ నిర్మాతల కంగారు వెనుక రజనీ ఉన్నాడా..?

మహేష్ సినిమా అయోమయంలో పడిపోయింది. రజనీకాంత్ సినిమా వ్యవహారం మీద ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన బన్ని వాసు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘2.ఓ’ ఆ సమయంలో విడుదలైతే తన సినిమాతోపాటు, ‘భరత్‌ అనే నేను’ సినిమాకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు. ఏప్రిల్‌లో ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ ‘2.ఓ’ను విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదే విషయంపై ‘భరత్‌ అనే నేను’ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తాజాగా స్పందించింది. ఈ మేరకు ట్విటర్‌లో వరుస ట్వీట్లు చేసింది. ‘మరో భాషా చిత్రాన్ని టాలీవుడ్‌ ఎప్పుడూ గౌరవిస్తుంది.
పెద్ద సినిమా అయిన ‘2.ఓ’ సినిమా విడుదల తేదీ వాయిదాలు మీద వాయిదాలు పడుతుండటం వల్ల మిగిలిన నిర్మాతలు అయోమయంలో పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించాడు.

ఏప్రిల్‌, మే నెలల్లో సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నామని, నిర్మాతలు మాలో మాకే పోటీ వద్దు అనుకుని, చర్చించుకుంటున్నారు’. ‘ఇప్పుడు ఉన్నట్టుండి ‘2.ఓ’ను ఏప్రిల్‌లో విడుదల చేస్తామని ఆ బృందం ప్రకటించడం వల్ల తెలుగు సినిమాలు మరో అయోమయంలో పడ్డాయి. ట్రేడ్‌ బాడీస్‌ ఈ సమస్యను పరిగణనలోకి తీసుకుని, సరైన సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం’ అని ఆ సంస్థ తన ట్వీట్లలో పేర్కొంది.

మహేశ్‌బాబు 24, ‘2.ఓ’ అనే హ్యాష్‌ ట్యాగ్‌లను కూడా జత చేసేసారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ దర్శకుడు. బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ కథానాయిక. ఈ సినిమాను ఏప్రిల్‌ 27న విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మరో పక్క అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో నటిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బన్ని సరసన అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్‌ 14న విడుదల చేయబోతున్నట్టు గతంలో ఈ చిత్ర బృందం ప్రకటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news