Gossipsమొన్నరకూల్.. నిన్న అను ..నేడు అనుపమ మారుతున్న చెర్రీ హీరోయిన్స్ !

మొన్నరకూల్.. నిన్న అను ..నేడు అనుపమ మారుతున్న చెర్రీ హీరోయిన్స్ !

బోయపాటి దర్శకత్వంలో రాబోతున్న చెర్రీ సినిమా మీద భారీ అసలే ఉన్నాయి. త్వరలో షూటింగ్ మొదెలెట్టుకోనున్నఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై అనేక మల్లగుల్లాలు పడుతున్నారు. ముందుగాఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా  రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరమీదకు వచ్చింది అయితే అనూహ్యంగా ఆమె పేరు ప్రతిపాదనల నుంచి తప్పుకుంది. 

కారణం రకూల్ ఇప్పటికే చెర్రీతో చాలా సినిమాలు చేసి ఉండడంతో ఈ జోడి రొటీన్ అయిపోతుందని భావించి ఈ సినిమా నుంచి రకూల్ ని పక్కన పెట్టారు. ఆమె స్థానంలో ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మెగా హీరోయిన్ గా పేరు పొందిన  అను ఇమ్మాన్యువల్ ను ఎంపిక చేసారు. అను ఇమ్మాన్యువల్ ఎంపిక దాదాపు ఖాయం అనే  సోషల్ మీడియాలో వార్తలు కూడా ప్రచారం అయ్యాయి.  అయితే తాజాగా రామ్ చరణ్ పక్కన అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. మరి అనుపమ, చరణ్ కి జోడి అనే ఈ వార్త నిజమనే సమాచారం అందుతుంది.

ఇప్పటికే ఇండస్ట్రీ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న అనుపమ కి రామ్ చరణ్ పక్కన అవకాశం రావడం ఆమెకు మంచి భవిష్యత్తు వుండబోతుందనే సంకేతాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బోయపాటి రామ్ చరణ్ సినిమా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తో రెగ్యులర్ షూట్ ప్రారంభం కాబోతుంది. పీటర్ హెయిన్స్ ఈ మూవీ కి ఫైట్స్ ని సమకూరుస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news