Gossipsసాయి ధరం తేజ్ సినిమాకు ఏమైంది..!

సాయి ధరం తేజ్ సినిమాకు ఏమైంది..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా బివిఎస్ రవి డైరక్షన్ లో వస్తున్న సినిమా జవాన్. సినిమా ఎప్పుడో పూర్తయినా సరే రిలీజ్ కు మాత్రం మోక్షం కలుగట్లేదు. సుప్రీం హిట్ తర్వాత తిక్క, విన్నర్, నక్షత్రం ఫ్లాపులను ఫేస్ చేసిన సాయి ధరం తేజ్ జవాన్ తో అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కథ పరంగా బాగానే ఉన్నా సినిమాను రవి సరిగా హ్యాండిల్ చేయలేదు అన్నది ఫిల్మ్ నగర్ టాక్.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అక్టోబర్ లో అయినా వస్తుంది అనుకుంటే ఇప్పుడు నంవంబర్ కూడా కాదు డిసెంబర్ లో రిలీజ్ అంటున్నారు. కృష్ణ నిర్మాణ సారధ్యంలో వస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకులుగా ఉన్నారు. సినిమా అవుట్ పుట్ అంత సాటిస్ఫైడ్ గా లేదని సినిమా మీద ఫోకస్ పెట్టట్లేదట.

సాయి ధరం తేజ్ కూడా ప్రస్తుతం వినాయక్ తో చేస్తున్న సినిమా మీద దృష్టి పెట్టాడట. జవాన్ సినిమా రిలీజ్ విషయంలో తేజ్ కూడా లైట్ తీసుకున్నాడని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news