Gossipsవైజాగ్ లో బాలకృష్ణ ధర్నా..!

వైజాగ్ లో బాలకృష్ణ ధర్నా..!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం సి.కళ్యాణ్ నిర్మాత గ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో “జై సింహా” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది బాలకృష్ణ కు 102 వ సినిమా. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా కథ కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో నడుస్తుందని సమాచారం.

నవంబర్ 1 వ తేదీన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుందని తెలిపారు దర్శకుడు కే.ఎస్. రవికుమార్.ఇక ఈ సినిమాని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉంది అట చిత్ర బృందం.

భారీ బడ్జెట్‌తో అనేక మంది సాంకేతిక నిపుణుల సహాయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట చిత్ర నిర్మాత సి.కళ్యాణ్. ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్‌లో బాలకృష్ణ తో సహా సుమారు 5 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, 100 కు పైగా బస్సులతో చిత్రంలో కీలకమైన ఒక ‘ ధర్నా’ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారట. ఈ సన్నివేశం తరువాత బాలకృష్ణ – హరిప్రియ పై ఒక పాట చిత్రీకరించనున్నారు.బాలకృష్ణ ఇప్పటి వరకు ‘సింహ’ అనే టైటిల్ తో చేసిన సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి, అలాగే మా “జై సింహ” కూడా ప్రేక్షకులని అలరిస్తుందని చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేసారు.

balakrishna dharna

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news