Lifestyleరైతులకోసం మరో త్యాగం..పాపం ఆ హీరో..ఏమి చేసాడో తెలిస్తే షాకే..!

రైతులకోసం మరో త్యాగం..పాపం ఆ హీరో..ఏమి చేసాడో తెలిస్తే షాకే..!

తమిళ నాట ఒక్కో హీరో ఒక్కో విధంగా అక్కడి ప్రజలను ఆదుకునే పనిలో ఉన్నారు. మొన్నటికి మొన్న విశాల్ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి అని ఢిల్లీ స్థాయిలో దీక్ష చేసిన రైతులకు మద్దతుగా నిలబడ్డాడు…ఇప్పుడు ఆ వంతు ధనుష్ డి అయింది. సినీ నటుడు ధనుష్‌ తన తల్లిగారి ఊరైన శంకరాపురం గ్రామస్థులు పంట నష్టాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న, గుండెపోటుతో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసి ప్రశంసలందుకున్నారు. తేని జిల్లా శంకరాపురంలో ధనుష్‌ కులదైవమైన కరుప్పసామి ఆలయాన్నికుటుంబ సమేతంగా ప్రతియేటా దర్శించటం ఆనవాయితీ.

ఆ మేరకు బుధవారం ధనుష్‌, ఆయన సతీమణి ఐశ్వర్య, తల్లి దండ్రులు కస్తూరి రాజా, విజయలక్ష్మి తదితర కుటుంబీకులతో అక్కడికి వెళ్ళి కరుప్పసామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పంటనష్టాలతో ప్రాణాలు కోల్పోయిన 125 మంది రైతుల కుటుంబీకులకు తలా రూ.50 వేల చొప్పున రూ.63 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈసందర్భంగా ధనుష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో తమిళ రైతుల ఆత్మహత్యలు , గుండె పోటుతో మృతి చెందటం వంటి సంఘటనలను చూసి తల్లడిల్లిపోయానని ఇక నుంచి ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు…పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడాలి అని అక్కడికి వచ్చిన ప్రజలను రైతుకుటుంబాలను ఉద్దేశించి మాట్లాడారు.

ఆ రైతు కుటుంబాలకు అండగా, ఉడుతాభక్తిగా తన వంతు సాయం అందించాలని దర్శకుడు సుబ్రమణ్యశివ కెమెరామెన్‌ వేల్‌రాజ్‌ నాయకత్వంలో 11 మంది సభ్యులున్న కమిటీని ఏర్పాటు చేసి రైతన్నలను కోల్పోయిన 250 కుటుంబీకులను ఎంపిక చేశారని, తొలివిడతగా 125 మందికి యాభైవేల చొప్పున ఆర్థిక సహాయం అందించానని ఆయన తెలిపారు. మలి విడతలో మరో 125 మంది రైతు కుటుంబాలను ఎంపిక చేసి వారికి కూడా తలా రూ. 50 వేలు అందిస్తానని ధనుష్ తెలిపారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news