Newsకోటక్ మహింద్రా బ్యాంక్ ఆఫర్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది మీకు!!

కోటక్ మహింద్రా బ్యాంక్ ఆఫర్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది మీకు!!

బ్యాంకులు అంటేనే బెంబేలెత్తి పోయేలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్న వేళ కోటక్ మహీంద్రా బ్యాంకు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. జీరో చార్జ్ – జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాలను అందించనున్నట్టు ప్రకటించి సంచలనానికి తెరలేపింది. అంతేకాకుండా మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తామని డిజిటల్ లావాదేవీలపై రుసుములు వసూలు చేయబోమని తెలిపింది. అలాగే ఆధార్ ఆధారిత వన్ టైం పాస్ వర్డ్ ను అందిస్తామని ఆధార్ – పాన్ కార్డు తీసుకొచ్చి ఏ శాఖ నుంచైనా కేవలం ఐదు నిమిషాల్లోనే ఖాతాను తెరవవచ్చని ప్రకటించింది. ఖాతాల్లోని మొత్తంపై 6శాతం వార్షిక వడ్డీని కూడా అందిస్తామని కూడా సూపర్ ఆఫర్ ఇచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news