Newsబయటపడ్డ దేవిశ్రీప్రసాద్ అసలు రంగు.. డబుల్ గేమ్ బాగానే ఆడుతున్నాడుగా!

బయటపడ్డ దేవిశ్రీప్రసాద్ అసలు రంగు.. డబుల్ గేమ్ బాగానే ఆడుతున్నాడుగా!

Rocking star Devi Sri Prasad hikes his remuneration. According to sources, he damanding 3 crores money. But here he is playing double game. Read to know that.

దక్షిణాది ఇండస్ట్రీలో బాగా పేరు సంపాదించిన మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీప్రసాద్ ఒకడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆ రాకింగ్ స్టార్‌కి ఇండస్ట్రీలో రోజురోజుకు డిమాండ్ బాగానే పెరిగిపోతోంది. ఇక రీసెంట్‌గా.. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ సినిమాకి అందించిన సంగీతానికి విపరీతమైన పాజిటివ్ టాక్ రావడంతో దేవి రేంజ్ మరింత పెరిగింది. ఇంకేముంది.. అందరిలాగే మనోడు కూడా ఇదే మంచి సమయం అనుకుని తన పారితోషికం భారీగా పెంచేశాడు.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ తన పారితోషికాన్ని అక్షరాల రూ. 2.5 కోట్లకు పెంచేశాడని తెలిసింది. ఇకపై తాను పని చేయబోయే సినిమాలకు అంత అమౌంట్ తీసుకుంటానని, ఒక్క రూపాయి తక్కువైనా చేసేదిలేదంటూ తెగేసిమరీ చెబుతున్నాడట. అంతేకాదు.. తన దగ్గర పనిచేసే లిరిక్ రైటర్స్, సింగర్స్, టెక్నీషియన్స్‌కి అదనంగా రూ.50 లక్షలు ముట్టజెప్పాల్సిందేనట. ఈ లెక్కన.. దేవిశ్రీకి ఓవరాల్‌గా రూ.3 కోట్లు సమర్పించుకోవాల్సి ఉంటుందన్నమాట. అయినా.. దేవిశ్రీ అందిస్తున్న మ్యూజిక్ సినిమాకి బాగా హెల్స్ అవుతోందని, ఎలాగో అతని క్రేజ్ కూడా బాగానే ఉంది కాబట్టి.. అంతమొత్తం ఇవ్వడంలో తప్పేం లేదని అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

అంతా బాగానే ఉంది కానీ.. తనకు బాగా కావాల్సిన వాళ్ళకు మాత్రం దేవిశ్రీప్రసాద్ ఓ 25 లక్షలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన కొందరు నిర్మాతలు.. అతనిపై కాస్త కోపంగానే ఉన్నారట. ఇండస్ట్రీలో అందరితో ఒకేలా ఉండాలని, ఇలా డబుల్ గేమ్ ఎందుకు ఆడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. దీనిపై దేవి ఏమంటాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news