Gossipsఫ్యాన్స్‌కి ఫ్యూజులు ఎగిరిపోయే వార్త.. బోయపాటి దర్శకత్వంలో బన్నీ-ఎన్టీఆర్!

ఫ్యాన్స్‌కి ఫ్యూజులు ఎగిరిపోయే వార్త.. బోయపాటి దర్శకత్వంలో బన్నీ-ఎన్టీఆర్!

Mass director Boyapati Srinu making a master plan for Bellamkonda Srinivas movie. According to latest updates, NTR and Allu Arjun may do guest roles in this movie on Boyapati’s request.

గతంలో ఓ దర్శకుడు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, స్టైలిస్‌స్టార్ అల్లుఅర్జున్‌లతో మల్టీస్టారర్ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపించింది. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. దీంతో.. ఈ వార్తపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా? అని మెగా, నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. దాని సంగతేమో కానీ.. తాజాగా ఫ్యాన్స్‌కి ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్ మాత్రం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆ ఇద్దరు హీరోలను కలిపే ప్లాన్ చేశాడని సమాచారం. తారక్‌తో ‘దమ్ము’, బన్నీతో ‘సరైనోడు’లాంటి సినిమాలు తీసిన బోయపాటి.. ఇప్పుడు వారిద్దిరినీ ఓకే స్ర్కీన్‌పై చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. అయితే.. ఇది మల్టీస్టారర్ సినిమా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా బోయపాటి తీస్తున్న సినిమాలో వాళ్లిద్దరూ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారని ఓ టాక్ నడుస్తోంది. ఈ సినిమాకి మరింత క్రేజ్ తీసుకురావడం కోసమో తారక్, బన్నీలతో గెస్ట్ రోల్స్ చేయించే ప్లాన్ చేశాడట. అందుకు తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేసినట్టు ఇన్‌సైడ్ సమాచారం.

ఆ ఇద్దరు ఈ ప్రాజెక్టులో జాయిన్ అవుతుండడంతో.. సినిమా బడ్జెట్ కూడా భారీగానే పెరిగిందట. ఇంతకుముందు 22 కోట్లతో సినిమాని తీయాలని అనుకోగా.. వారి రాకతో 30 కోట్లకి పెరిగిందని ఫిల్మ్ సర్కిల్‌లో ప్రచారం సాగుతోంది. ఒకవేళ వాళ్ళిద్దరూ నిజంగానే ఈ మూవీలో గెస్ట్ రోల్స్ చేస్తే.. ఈ క్రేజీ కాంబో కారణంగా సినిమాకి బోలెడంత ప్రచారం వచ్చిపడుతుందనడంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news