Gossipsహరికృష్ణ మరణంతో..ఒక్కటైన నందమూరి హీరోలు..వైరల్ అవుతున్న వీడియో!

హరికృష్ణ మరణంతో..ఒక్కటైన నందమూరి హీరోలు..వైరల్ అవుతున్న వీడియో!

మొన్నటి వరకు నందమూరి ఫ్యామిలీలో ఒక రూమర్ ఉండేది..నందమూరి హరికృష్ణ, జూ.ఎన్టీఆర్ లతో నందమూరి బాలకృష్ణ కు అభిప్రాయ భేదాలు ఉన్నాయని..ఆ మద్య ఓ ఫంక్షన్లో కూడా అన్నయ్యను పలకరించకుండా వెళ్లారని రక రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం తమకు ఎలాంటి విభేదాలు లేవని నందమూరి ఫ్యామిలీ కలిసిమెలిసి ఉంటుందని చెబుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే..నల్లగొండ జిల్లా అన్నెపర్తి వద్ద నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతితో తెలుగు ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.

అయితే ఆయనను పరామర్శించడానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు విచ్చేశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మరణం కుటుంబసభ్యుల మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలను తుడిచిపెట్టేసింది. కుటుంబసభ్యులందరూ ఒకరికి మరొకరు తోడున్నామన్నంతగా ఏకమైపోయారు. హరికృష్ణ భౌతికకాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు భుజాన మోయడం అందరికీ సంతోషం కలిగేలా చేసింది.

భోజనాలు చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ల వద్దకు వెళ్లిన బాలయ్య… వారిద్దరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. బాలయ్య మాట్లాడుతుంటే తారక్ ఎంతో వినయంగా వింటుండటం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే..ఇక నుంచి నందమూరి కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ లకు బాబాయిగా అండదండగా ఉండబోతున్నారా..ఇంటికి పెద్దలా చూసుకుంటారా అలాగే ఉంటే..ఇక నందమూరి హీరోలకు ఎదురే ఉండదని ఫ్యాన్స్ అంటున్నారు.

https://youtu.be/Og-ru2bu6fs

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news