Gossipsరిలీజ్ ముందు ఎన్.టి.ఆర్ కథానాయకుడికి షాక్..!

రిలీజ్ ముందు ఎన్.టి.ఆర్ కథానాయకుడికి షాక్..!

నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఈ నెల 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఓవర్సీస్ లో హంగామా మొదలైంది. అక్కడ నందమూరి ఫ్యాన్స్ భారీ ప్రీమియర్స్ కు సిద్ధమవుతున్నారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాను ఎక్కువ లొకేషస్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అదే స్థాయిలో ముందురోజు అంటే జనవరి 8న ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రీమియర్స్ టికెట్ ప్రైజ్ భారీ రేటు చెబుతున్నారట. ఆంధ్రాలో కూడా ఎన్.టి.ఆర్ కథానాయకుడు రిలీజ్ కు భారీ సన్నాహాలు చేస్తున్నారట.

అక్కడ కూడా ప్రీమియర్స్ తో పాటుగా సంక్రాంతి హాలీడెస్ కాబట్టి వారం పాటు 6 షోలు వేసేలా ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకుంటున్నారట. ఇదిలాఉంటే అన్నిచోట్ల బాగానే ఉంది కాని తెలంగాణాలో మాత్రం ఎన్.టి.ఆర్ బయోపిక్ కు షాక్ తగిలేలా ఉంది. ఇక్కడ అర్ధరాత్రి ప్రీమియర్ షోస్ కు చెక్ పెట్టారు. అవసరం అయితే ఎర్లీ మార్నింగ్ షోస్ వేసుకోండి తప్ప మిడ్ నైట్ షోస్ వద్దే వద్దని సీరియస్ గా చెబుతున్నారు. ఈమధ్య స్టార్ హీరోల సినిమాలు హైదరాబాద్ కన్నా ముందే వేరే చోట పడి టాక్ బయటకు వస్తున్నాయి.

ఎన్.టి.ఆర్ బయోపిక్ కు తెలంగాణాలో రిలీజ్ ముందు షాక్ తగిలింది. ఇక్కడ ఎక్కువ షోలకు పర్మిషన్ దొరికే అవకాశం లేదని తెలుస్తుంది. ఈ సంక్రాంతికి సిని సందడి బాగానే ఉండేలా ఉంది. ఎన్.టి.ఆర్ సినిమాతో పాటుగా వి.వి.ఆర్, ఎఫ్-2, పేట సినిమాలు పోటీకి వస్తున్నాయి. మరి వీటిలో ఏ సినిమా విజయకేతనం ఎగురవేస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news