Gossipsరజినీని ఘోరంగా అవమానించిన మెగా మాఫియా..!

రజినీని ఘోరంగా అవమానించిన మెగా మాఫియా..!

టాలీవుడ్ లో ‘మెగా’ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే… చాలా మంది హీరోలు వెండి తెరమీద వెలిగిపోతున్నారు. అలాగే ఫిలిం ఇండ్రస్ట్రీని అల్లు అరవింద్ ఒకరంగా ఏలేస్తున్నాడు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక థియేటర్లను తమ గుప్పెట్లో పెట్టుకున్నాడనే అపవాదు కూడా ఉంది. ఇక ఈ పండుగ సీజన్ లో భారీ భారీగా వచ్చే సినిమాలకు ప్రస్తుతం థియేటర్లు దొరకని పరిస్థితి.

ఇప్పటికే పండగ రోజు భారీ సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఎన్టీఆర్ మూవీ, వినయ విధేయ రామ సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేసేందుకు రెఢీ అవుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలకు థియేటర్ల కొరత రాకుండా బడా ప్రోడ్యూసర్స్ థియేటర్లు పంచుకున్నాయి. అయితే ఈ గ్యాప్ లో రజినీ పేట సినిమా తెలుగులో డబ్ అవుతుంది. అయితే దీనికి థియేటర్ల కొరత ఏర్పడింది.

ఈ విషయంలో తీవ్ర కోపానికి గురైన డిస్టిబ్యూటర్ ప్రసన్న, ప్రోడ్యూసర్ అశోక్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ…తిట్ల దండకం అందుకున్నారు. మాఫియా నడుస్తుంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. దేవుడు పై నుంచి అన్నీ చూస్తున్నాడంటూ ఫంక్షన్ లో బహిరంగంగానే విమర్శలు చేశారు. దీంతో ప్రస్తుతం వీరిద్దరి మాటలు అందరిని షాక్ కి గురిచేస్తున్నాయి. మెగా ఫ్యామిలీ ఒకరకంగా రజనీని అవమానిస్తున్నారు అంటూ…. ఓ కొత్త వాదన మొదలయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news