Gossipsమ‌హేష్ -బ‌న్నీ రాజీకి వ‌చ్చారా...

మ‌హేష్ -బ‌న్నీ రాజీకి వ‌చ్చారా…

టాలీవుడ్లో వచ్చే సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోల మధ్య అదిరిపోయే వార్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. మహర్షి హిట్ తర్వాత మహేష్ బాబు – అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ – త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సంక్రాంతికి ఖ‌ర్చీఫ్ వేసుకుంది. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు.

వాస్తవంగా ఈ రెండు సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసుకుని వచ్చే ఏడాది జనవరి 10 న థియేటర్లలోకి తీసుకు వ‌చ్చేలా ఈ సినిమాల మేక‌ర్స్‌ ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు వీరు రాజీకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా జనవరి 14న విడుదల కాబోతోంది. దీంతో రెండు సినిమాల మ‌ధ్య నాలుగు రోజుల పాటు గ్యాప్ రావ‌డంతో.. ఈ సినిమాల బయ్యర్లకు ఈ పోటీ వల్ల ఎటువంటి నష్టం లేకుండా రాజీ మార్గాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

నాలుగు రోజుల పాటు గ్యాప్ ఉంటే థియేట‌ర్ల స‌మ‌స్య కూడా ఉండ‌దు. బ‌న్నీ సినిమా వ‌చ్చే స‌రికే నాలుగు రోజుల పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌హేష్ స‌రిలేరు కుమ్మేసుకుంటుంది. ఆ త‌ర్వాత థియేట‌ర్ల‌ను చెరిస‌గం పంచుకున్నా ఎవ్వ‌రికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. ఇక సినిమాకు వ‌చ్చిన టాక్‌ను బ‌ట్టి ఎవ‌రి ద‌మ్మేటో త‌ర్వాత తేలుతుంది.

ఇక మ‌హేష్ సినిమాకు ఇప్ప‌టికే స‌రిలేరు నీకెవ్వ‌రు టైటిల్ ఫిక్స్ కాగా… త్రివిక్రమ్ బన్నీల మూవీకి ‘వైకుంఠపురంలో’ అన్న టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇద్ద‌రు యంగ్ స్టార్ హీరోల మ‌ధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా డేట్లు ఫిక్స్ చేసుకోవ‌డం హ‌ర్ష‌ణీయ‌మే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news