Gossipsముస్లీం యువకుడిగా ఎన్.టి.ఆర్.. షాక్ లో ఫ్యాన్స్..!

ముస్లీం యువకుడిగా ఎన్.టి.ఆర్.. షాక్ లో ఫ్యాన్స్..!

రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తుంది. స్వాతంత్రానికి ముందు జరిగే కథగా ఈ సినిమా ఉంటుందట. ఇక ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ బందిపోటుగా కనిపిస్తాడని అంటున్నారు. అయితే పాత్ర తాలూఖా మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. సినిమాలో ఎన్.టి.ఆర్ ముసలమాన్ గా కనిపిస్తాడట. ఎన్.టి.ఆర్ లుక్కే అదిరిపోయేలా ఉంటుందని చెబుతున్నారు.

సినిమా కోసం ఎన్.టి.ఆర్ ఇప్పటికే గడ్డం పెంచేస్తున్నాడు. అరవింద సమేత తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న ఈ సినిమాలో చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడంతో మెగా నందమూరి అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఎన్.టి.ఆర్ రోల్ అలా ఉంటుందని తెలుస్తుండగా చరణ్ మాత్రం పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తాడట. ఈ ఇద్దరి పాత్రలు సినిమాలో హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. కీర్తి సురేష్, కియరా అద్వానిల పేర్లి వినిపిస్తున్నాయి. మహానటితో కీర్తి, భరత్ అనే నేను సినిమాతో కియరా సత్తా చాటారు. ప్రస్తుతం కియరా చరణ్ వినయ విధేయ రామ సినిమాలో కూడా నటిస్తుంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తుబ్బ ఈ ట్రిపుల్ ఆర్ మూవీని ఆ సినిమా సరసన నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news