Gossipsమహేష్ ను ఘోరంగా అవమానించిన బాలీవుడ్ హీరోయిన్..!

మహేష్ ను ఘోరంగా అవమానించిన బాలీవుడ్ హీరోయిన్..!

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న మహర్షి సినిమా తర్వాత తాను చేసిన 1 నేనొక్కడినే డైరక్టర్ సుకుమార్ తో మరో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కత్రినా కైఫ్ ను సెలెక్ట్ చేసినట్టు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. చిత్రయూనిట్ కూడా ఆ వార్తలను ఖండించ లేదు కాబట్టి మహేష్, కత్రినా కాంబో ఫిక్స్ అనుకున్నారంతా.. కాని మహేష్ తో తాను నటించడం లేదని తెగేసి చెప్పేసింది బాలీవుడ్ భామ కత్రినా కైఫ్.

సల్మాన్ తో భారత్ సినిమా చేస్తున్న కత్రినా తాను ప్రస్తుతం ఈ సినిమా మాత్రమే చేస్తున్నానని.. వార్తల్లో వస్తున్నట్టుగా తాను ఏ తెలుగు సినిమాలో చేయడం లేదని చెప్పిది చెప్పింది. మహేష్ తో తాను నటిస్తున్నా అని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పుకొచ్చింది కత్రినా. ఆ సినిమాకు సంబందించిన వారెవరు తనని సంప్రదించలేదని వివరణ ఇచ్చుకుంది కత్రినా కైఫ్. సో మహేష్ తో కత్రినా కైఫ్ రొమాన్స్ అనుకున్న ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది కత్రినా కైఫ్.

తెలుగులో మళ్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాల్లో నటించిన కత్రినా కైఫ్ బాలీవుడ్ లో బిజీగా మారి ఇక్కడ సినిమాలను లైట్ తీసుకుంది. మరి ఈ సినిమా చేయనంది సరే ఒకవేళ మంచి ఆఫర్ వస్తే రాబోయే రోజుల్లో కత్రినా తెలుగు సినిమాలు చేయాలని ఆకాంక్షిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news