Gossipsప్రభాస్ దెబ్బకు మహేష్ తగ్గాల్సిందే..?

ప్రభాస్ దెబ్బకు మహేష్ తగ్గాల్సిందే..?

సూపర్ స్టార్ మహేష్ కేవలం సినిమాలతోనే కాకుండా వాణిజ్య ప్రకటనలతో కూడా రెండు చేతులా సంపాదిస్తున్నాడు. కొత్తగా ఇప్పుడు థియేటర్ బిజినెస్ లోకి దిగాడు మహేష్. ఏసియన్ సునీల్ తో కలిసి ఏ.ఎం.బి సినిమాస్ ను నిర్మించారు. కొండాపూర్ టూ కొత్తగూడ క్రాస్ రోడ్ లో ఏ.ఎం.బి సినిమాస్ ఉంది. రీసెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ చేత ఆ థియేటర్ ఓపెనింగ్ చేయించారు. థియేటర్ కవరేజ్ కు వెళ్లిన వారంతా అదో ఇంద్రభవనం అనేస్తున్నారు.

ఇదిలాఉంటే మహేష్ వేసిన ఈ క్రేజీ స్టెప్ కు టాలీవుడ్ స్టార్స్ కూడా అవాక్కయ్యారు. అందుకే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా థియేటర్ రంగంలోకి దిగుతున్నాడని తెలుస్తుంది. అయితే అంతకంటే ముందే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తిరుపతిలో మహేష్ ఏ.మె.బి ప్రొడక్షన్ మించేలా ఓ థియేటర్ కట్టిస్తాడని తెలుస్తుంది. మహేష్ ఏ.ఎం.బి ప్రొడక్షన్ కు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు. ఇప్పుడు దాన్ని మించేలా తిరుపతిలో మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నాడట ప్రభాస్.

ఏసియన్ సునీల్ ఎలాగు తమకి ఆంధ్రాలో ఏ.ఎం.బి సినిమాస్ నిర్మించే ఆసక్తి లేదని చెప్పడంతో ఇక్కడ మహేష్ థియేటర్ ను పోలి ప్రభాస్ అక్కడ ఓ భారీ మల్టీప్లెక్స్ కు ప్లాన్ చేస్తున్నాడట. బాహుబలి సినిమాతో ప్రభాస్ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోగా ఆ సినిమా ప్రమోషన్స్ లో పలు థియేటర్స్ చూసిన అనుభవం ఉన్న ప్రభాస్ నార్త్ సైడ్ ఉన్న థియేటర్ ఎక్స్ పీరియన్స్ ను తిరుపతి ప్రజలకు అందించాలని చూస్తున్నారట. మరి దీనికి సంబందించిన మిగతా డీటైల్స్ రావాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news