Gossipsతెలుగు రాష్ట్రాల్లో ఎన్.టి.ఆర్ కథానాయకుడు మొదటి షో టైమింగ్..!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్.టి.ఆర్ కథానాయకుడు మొదటి షో టైమింగ్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ డైరక్షన్ లో తండ్రి ఎన్.టి.ఆర్ జీవిత చరిత్రతో వస్తున్న సినిమా ఎన్.టి.ఆర్. రెండు పార్టుగా వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ కథానాయకుడు బుధవారం రిలీజ్ కు అంతా సిద్ధమైంది. జనవరి 9 రిలీజ్ అవుతున్న ఈ సినిమా 8 మిడ్ నైట్ ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడనున్నాయి. అయితే తెలుగు రెండు రాష్ట్రాల్లో మొదటి షో ఎప్పుడు.. ఎన్నిటికి మొదటి షో పడుతుంది అన్న విషయాల మీద నందమూరి ఫ్యాన్స్ అంతా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

అయితే తెలంగాణాలో బెనిఫిట్ షోస్ కు పర్మిషన్ లేదు. ఆంధ్రాలో కూడా తెల్లవారుఝామున షోస్ ఉంటాయే తప్ప మిడ్ నైట్ షోస్ కష్టమని తెలుస్తుంది. ఇక అక్కడ ఎలాగు టిడిపి ప్రభుత్వం కాబట్టి అధిక షోలకు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో మొదటి షోకి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. బుధవారం ఉదయం 9 గంటలకు భ్రమరాంభ థియేటర్ లో ఈ షో పడుతుందట. ఈ షోకి నందమూరి బాలకృష్ణతో పాటుగా చిత్రయూనిట్ పాల్గొంటారని తెలుస్తుంది.

ఎన్.టి.ఆర్ బాల్యం, సిని రంగ ప్రవేశం నేపథ్యంలో ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా సాగుతుందట. ఇప్పటికే రిలీజ్ ప్రోమోస్ లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మొదటి పార్టే 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో బాలకృష్ణ కెరియర్ లో హయ్యెస్ట్ రికార్డ్ నెలకొల్పింది. మరి రిలీజ్ ముందు హడావిడి బాగున్నా ఆఫ్టర్ రిలీజ్ ఈ ఉత్సాహం డబుల్ అవడం గ్యారెంటీ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news