Gossipsతాంత్రికుడి మాట విని.. పిల్లాడిని చంపబోయిన బంధువులు..!

తాంత్రికుడి మాట విని.. పిల్లాడిని చంపబోయిన బంధువులు..!

సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత దేశం ఎంత ముందడుగు వేస్తున్నా కొన్ని చోట్ల మూఢనమ్మకాలు ఇంకా ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. గ్రామాల్లో ఈ మూడనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. లేటెస్ట్ గా ఇలాంటి మూడనమ్మకానికి సంబందించిన ఓ న్యూస్ అందరికి షాక్ ఇచ్చ్చింది. ఉత్తరప్రదేశ్ లోని బారాబం జిల్లాలో ఓ బాలుడిని చంపాలని కుటుంబ సభ్యులు వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది.

చిన్నప్పటి నుండే రెండు చేతులకు, రెండు కాళ్లకు 6 వేల్లతో పుట్టిన పిల్లాడిని ఓ తాంత్రికుడు మాట ప్రకారం చంపేయాలని చూశారు. ఆ బాలుడుని బలి ఇస్తే సంపద కలుగుతుందని తాంత్రికుడు చెప్పాడట. అందుకే బంధువులే అతని పాలిట విలన్లుగా మారారట. విషయం తెలుసుకున్న ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా బాలుడికి ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటామని.. అతనికి చదువుకి కావాల్సిన ఏర్పాట్లను చేస్తామని హామి ఇచ్చారట.

ఇక పోలీస్ అండగా ఉండటంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి మూడనమ్మకాల నుండి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జన విజ్ఞాన వేదికలు తమ ప్రయత్నాలు చేస్తున్నా సరే ఊళ్లల్లో వాటి ప్రభావం చూపించడం లేదు.

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news